=''/>

30, ఆగస్టు 2010, సోమవారం

మా సీమ టపాకాయ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఎవరా సీమ టపాకాయ ?అనుకుంటున్నారా .......


ఇంకెవరూ .........మా సిసింద్రీ,చీలి చింతకాయ ,సీమ టపాకాయ అన్నీ మా అమ్మాయి.... " సత్యప్రియ". .

తన" పుట్టినరోజు " ఈ రోజు.

తను  హాస్టల్ లో ఉంటుంది. 

మేముండేది పల్లెటూరు కావడం వలన కొంచెం మంచి స్కూల్ లో చదివించాలంటే హాస్టల్ లో చేర్చక తప్పదు. తనని ఫిఫ్త్ క్లాస్ కొచ్చాక హాస్టల్ లో పెట్టాము.హాస్టల్ లో జేర్చాక చాలా రోజులు తన మీద బెంగగా ఉండేది. రాత్రిళ్లు నిద్రపోయేటప్పుడు ఏడ్చేసే దానిని. కొద్ది రోజులకు అలవాటు పడిపోయాననుకోండి .కొత్తల్లో ఐతే హాస్టల్ కి చూడడానికి వెళితే అదేడుస్తుంటే నాకు కూడా ఏడు పోచ్చేసేది.మా ఇద్దరినీ చూసి అక్కా వాళ్ళు నవ్వేవారు .నన్ను తిట్టేవారు..నువ్వు దానిని చూడడానికి వస్తున్నావా ...ఏడిపించడానికి వస్తున్నావా అని .

దానికి కుడా ఇంటి బెంగ బాగాఎక్కువ . .ఇంటికొచ్చి వెల్లినప్పుడుల్లా కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని వెళ్ళేది. వాళ్ళ హాస్టల్ పక్కన అపార్ట్మెంట్లు ఉంటాయి .అక్కడికి వచ్చేయండి అంటుంది .అక్కడికి వస్తే ఎలా ఉంటుందో ఉహించుకుని ఆనంద పడుతుంటుంది పాపం .మేము అక్కడికి రామని తెలుసు ఐనా అదో తుత్తి దానికి .ఈ మధ్య ఓరోజు నువ్వు ఇంటర్ లో హాస్టల్ కి వెళ్ళావ్ ,మరి నన్ను ఫిఫ్త్ లోనే ఎందుకేసారు .అని అడిగింది . కాసేపు ఏమి చెప్పాలో తెలియలేదు .తరువాత ఏదో సర్ది చెప్పననుకోండి .. ఈ మధ్య పరవాలేదు కొంచెం తెలుసుకుంది .ఏడవకుండా వెళుతుంది ..ఫోన్ చేసినా బాగా మాట్లాడుతుంది .

ఈ రోజు మా " ప్రియ " పుట్టినరోజు కదా  హాస్టల్ కెళ్ళి  కేక్ కట్ చేయించాలి .సాయంత్రం వరకూ దానితో గడిపి రావాలి .


బంగారం నువ్వు ఇటువంటి వంటి పుట్టినరోజులు జీవితాంతం జరుపుకోవాలని ఆశిస్తూ ...................

ఆ బగవంతుడు నీకు ఆయురారోగ్యా లందించాలని మనఃపూర్వకం గా కోరుకుంటూ ...........


ప్రియమ్మలూ పుట్టినరోజు శుభాకాంక్షలు రా.......................

29, ఆగస్టు 2010, ఆదివారం

నేడు మన మాతృభాషా దినోత్సవం

గిడుగు రామ్మూర్తి పంతులు గారి 147 వ జయంతైన ఈ రోజు ని మనం " మాతృ భాషా దినోత్సవం" గా జరుపుకుంటున్నాము.

శిష్ఠ వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన చాలా కృషి చేసారు .

శ్రీకాకుళం జిల్లాలో పర్వతాల పేటలో ఆయన 1863ఆగష్టు 29న వీర్రాజు ,వెంకమ్మ దంపతులకు జన్మించారు .

1896 లో బి.ఎ డిస్టింక్షన్ ఆయన చదువు పూర్తి చేసారు .గజపతి మహారాజా కాలెజీ లో అధ్యాపకుడిగా పనిచేశారు.తెలుగుభాషా బోధనను వ్యావహారికంలో చేయాలని ఆయన ఆలోచనకు జే.ఎ.యేట్స్ అనే ఆంగ్లేయాదికారి నుండీ మద్దతు లభించింది .అప్పటి ఏవీ ఎన్ కాలెజీ ప్రదాన అధ్యాపకుడు శ్రీనివాస అయ్యంగార్ ,గురజాడ అప్పారావు,యేట్స్ , రామప్ప పంతులు గారూ కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి కృషి చేసారు .వీరి కృషి కారణంగా 1912 -13 స్కూల్ ఫైనల్ తెలుగు పరీక్షను గద్యంలో లేదా వ్యావహారిక భాషలో రాయొచ్చని ఆదేశాలు జారీ చేసారు . అప్పటినుండి స్కూల్,కాలేజీ పాఠ్య పుస్తకాలు వ్యావహారిక భాషలో వెలువడటం మొదలుపెట్టాయి .ఆయన సేవలను గుర్తించిన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము రావ్ బహుద్దూర్ బిరుదు ప్రదానం చేసింది .వ్యవహారిక భాషకు ఇంత సేవచేసిన ఆయన 1940 ,జనవరి 22వ తెదీ న మరణించారు .

మన తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆయన జయంతిని మనమంతా ఈ రోజు "తెలుగు భాషా దినోత్సవం" గా జరుపుకుంటున్నాము..

.



.

25, ఆగస్టు 2010, బుధవారం

నా రాఖీ టపా ఆంధ్రజ్యోతి నవ్య లో వచ్చిందోచ్ !!


మాకు ఆంధ్రజ్యోతి పేపర్ వస్తుంది . రోజూ ఉదయం పేపర్ రావడంతోనే హెడ్లైన్స్ చూసి ,9 గంటలకి బాబు స్కూల్ కి వెళ్లాక టిఫిన్ చెస్తూ పేపర్ అంతా తీరుబడిగా చదువుతాను.



ఈ రోజు కూడా అలానే పేపర్ చదువుతూ నవ్య పేపర్ లో నా రాఖీ టపా చూసి ఆశ్చర్య పోయాను . చాలా ఆనందపడి పోయాను .వెంటనే అక్కలకి ,చెల్లికి ఫోన్ చేసి చెప్పేసేను.ఇంతకీ వాళ్ళందరికీ ఈనాడు పేపర్ వస్తుంది . ఆంద్రజ్యోతి పేపర్ కొనైనా సరే చదవండి అని వాళ్లకి చెప్పేను.

మరి నా మిత్రు లైన మీతో కుడాచెప్పి ,చూపించి ....... నా ఆనందాన్ని పంచుకోవాలికదా .అందుకే మీ అందరితోనూ ఈ ఆనందాన్ని పంచుకోవడానికే ఈ టపా.

24, ఆగస్టు 2010, మంగళవారం

బ్లాగ్ సొదరీ,సోదరులకు రక్షా బంధన్ శుభాకాంక్షలు




ఈ రోజు శ్రావణ పౌర్ణమి .ఈ రోజు అన్నా,చెల్లుళ్ళు ఎంతో ఆనందం గా రాఖీ పండుగను జరుపుకుంటారు .

కానీ ,నాకు చిన్నప్పుడు రాఖీ పండుగ వస్తే కొంచెం విచారం గా ఉండేది .ఎందుకంటే మేము నలుగురుమూ అమ్మాయిలమే . అందరూ చక్కగా వాళ్ళన్నయ లకు,తమ్మూలకూ ఎలా రాఖీ కట్టేము, అన్నయ్య ఏమి గిఫ్ట్ ఇచ్చాడు ,ఇలా అన్నీ చెబుతూ ఉంటే ,నాకూ ఒక "అన్న "కానీ "తమ్ము" కానీ ఉంటే చక్కగా నేనూ రాఖీ కట్టేదాన్నికదా అనుకునేదాన్ని.అందులోనూ నాకు తమ్ముడంటే ఇంకా ఇష్టం . చక్కగా అక్కా ,అక్కా అంటూ తిరుగుతారు అని ,ఇంకా ఏవో చాలా అనుకునేదానిని . ఇప్పుడూ కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది .ఆ ఫీలింగ్ గుర్తు చేస్తూ రాఖీ పండుగ వచ్చేసింది .

అన్నలున్న చెల్లాయిలకు, తమ్ముళ్ళు న్న అక్కయ్యలకు .........

"రాఖీ శుభాకాంక్షలు "

బ్లాగ్ లోకపు అన్నలకూ ,తమ్ముళ్లకూ నా "రాఖీ శుభాకాంక్షలు ."

14, ఆగస్టు 2010, శనివారం

స్వాతంత్ర్య శుభాకాంక్షలు



బ్లాగ్ మిత్రులు అందరికీ

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

10, ఆగస్టు 2010, మంగళవారం

నేను వేసిన పైంట్లు ,నేను తయారుచేసినవి .




ఇది శెకుంతల గ్లాస్ పైన్టింగ్ .

ఇది "నిబ్ పైన్టింగ్" .లైన్స్ నిబ్,రౌండ్ నిబ్ అని ఉంటాయి .వాటితో వేస్తారు.ఆయిల్ పైంట్ తోనే వేస్తారు .
ఇవి నా డిగ్రీ అయ్యాక రాజమండ్రిలో నేర్చుకున్న పైన్టింగ్స్.

కింద వన్నీ నేను సొంతం గా తయారు చేసినవి.
ఇది ,సోలార్ వుడ్ అని ఒక మెటీరియల్ ఉంటుంది. దానిని ఇలా వివిధ షేప్ లలో కత్తిరించి ,అంటించి తయారు చేసిన నెమలి ..

ఇది దర్మోకాల్ తో చేసిన జపాను అమ్మాయి.ధర్మో కాల్ పైన డిజైన్ గీసుకుని ,కట్ చేసి పైన ముకమల్ క్లాత్ అంటించి ,చిప్స్ ఇంకా మనకు ఎలా కావాలంటే అలా అంటించుకో వచ్చు.
పాత చాకు ను వేడి చేసి ,కట్ చేస్తే దర్మోకాల్ చాలా తేలికగా కట్ అవుతుంది .


ఇది పాట్ పైంట్ .ఫెవికాల్ లో చాక్ పౌడర్ కలిపి ఇలా తీగలు గా చేసి పాట్ కు అంటించి కలర్స్ వేసేను.


దీనికి చాలా చాలా రకాలు అంటించాను.డైమండ్ షేపులో అంటించినవి చిన్న చిన్న నత్త గుల్లలు .పచ్చ,ఎరుపు రంగు లు ,మెత్తని ఇసుకలో కలిపి ఆరాక అంటించాను .పైన రౌండ్ షేపులకి,బియ్యం రంగులో కలిపి వేసాను. ఇంకా అద్దాలు ,గురువింద గింజలు అంటించాను .అక్కడక్కడా ఊడిపోయాయి.ఇవి చేసి పన్నెండేల్లు అవుతుంది.అందుకే కొంచెం డల్ గా ఉన్నాయి . .
ఇంకా చాలా చేసాను కానీ అవన్నీ పాడైపోయాయని పెట్టలేదు .బియ్యానికి కలర్స్ వేసి స్వాగతం అనిరాసి ఒకటిచేసాను .బాగుండేది కానీ కిందపడి పడి పోయి పోయింది .

4, ఆగస్టు 2010, బుధవారం

ఇది ఏమి పువ్వు?





"కదంబ పుష్పం" అండి ఇది .సరస్వతీ దేవికి ఎంతో ఇష్ట మైన పువ్వు..

నేను ఈ రోజే మొదటిసారి చూసాను. కదంబపువ్వు పేరు విన్నానుకానీ ,ఎప్పుడు చూడలేదు .చాలా బాగుంది .చాలా మంచి సువాసన నిస్తుంది .నాకెంత నచ్చేసిందంటే వెంటనే మొక్క తెచ్చి వేసేయాలనిపించింది.ఎక్కువగా అమ్మవారి గుళ్ళ వద్ద వేస్తారు.

ఈ మద్య మా ఉళ్ళో ఇద్దరిళ్ళ వద్ద వేశారన్నారు.వాళ్ళింటి వద్ద పూసిందంటే చూద్దామని తెప్పించాము.పనిలో పని మీకు కుడా చూపిస్తున్నాను.ఎలా ఉందండి ఈ" కదంబ పుష్పం"
?